ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం
ఇంట్లో భారీగా బంగారం, ఆభరణాలు బయటపడ్డాయని సమాచారం. మొన్న గురువారం కొందరు
సినీ, టీవీ నటుల ఇళ్లపై ‘ఐటీ దాడుల’ చేసిన నేపధ్యంలో బ్రహ్మీ ఇంట్లో ఈ
భారీగా గోల్డ్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. బ్రహ్మీ తన ఇంటి మీద ఐటీ
దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని షూటింగ్ నుంచి ఇంటికి చేరుకున్న
బ్రహ్మానందం ఐటీ అధికార్లకు ఇటీవలే కుమారుడుకి వివాహం చేసిన విషయం తదితర
అంశాల్లో వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఐటీ దాడులు చోటుచేసుకున్న సమయంలో సుమ రామోజీ ఫిలింసిటీలోను, సునిత తిరుపతిలోను, గీతామాధురి ఒక మ్యూజికల్ నైట్ షో నిమిత్తం అబుదాబీలోను ఉన్నట్లు తెలిసింది. ఉదయభాను ఇంటికి ఐటీ అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం. వీరి ఇండ్లలో ఎక్కువగా విదేశీ వస్తువులు తారసపడినట్టు తెలుస్తుంది.
సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ దాడులు అధిక మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే నిర్మాతలు, పంపిణీదారుల మీదే జరుగుతుంటాయి. అయితే ఈసారి విచిత్రంగా బుల్లితెర మీద వ్యాఖ్యానాలు సాగించుకునే కళాకారులు, గాయనీమణులు, ఆడియో వేడుకలకు వ్యాఖ్యానం జరిపే యాంకర్స్ మీద సైతం ఈ దాడులు జరగటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.