రజనీకాంత్ అల్లుడిపై మనసుపడిన బాలీవుడ్ భామ?
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో దనుష్ పై బాలీవుడ్ భామ మనసుపడినట్లు తెలుస్తోంది. గతంలో దనుష్ కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుత్రి హాసన్ మద్య కెమిస్ట్రి జరిగినట్లు కోలీవుడ్ లో పుకార్లు పుట్టాయి. త్రీ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరి మద్య రొమాన్స్ నడుస్తుందని రుమార్లు పుట్టాయి. అయితే కొత్తగా బాలీవుడ్ భామ ధనుష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొలవేరి కుర్రోడి పై సోనమ్ కపూర్ హాట్ కామెంట్ చేస్తుంది. రాంఝనాలో తనతోపాటు నటిస్తున్న తమిళ హీరో ధనుష్ను సోనమ్ కపూర్ ఆకాశానికి ఎత్తేసింది. తనకు ఏడేళ్ల నటనానుభవం ఉన్నా అతడి ముందుకు వచ్చాక కొత్తదానిని అనిపిస్తోందని చెబుతోంది. ఈ ప్రేమకథలో బెనారస్ నుంచి ఢిల్లీ జేఎన్యూకు చదువుకోవడానికి వచ్చే యువతి పాత్ర సోనమ్ది. ఆనంద్రాయ్ దర్శకుడు. ‘నాకంటే ఎంతో ముందుగానే ధనుష్ సినీపరిశ్రమలో ఉన్నాడు. అతనికి ఇది మొదటి హిందీ సినిమానే అయినా ధనుష్ బాలీవుడ్కు కొత్తవాడని నేను చెప్పలేను. మనకున్న అద్భుత నటుల్లో ధనుష్ ఒకడు. కచ్చితంగా నాకంటే మంచి నటుడు. అతనితో నటించేటప్పుడు నేను కొత్తదాన్ని అనిపించింది’ అని సోనమ్ తెలిపింది.
రాంఝనా జూన్ 28న విడుదలవుతోంది. తన అంతిమలక్ష్యం ఎప్పుడూ ఆనందమేనని చెప్పిన సోనమ్, భాగ్ మిల్ఖా భాగ్, ఖూబ్సూరత్ రీమేక్, యశ్రాజ్ ప్రొడక్షన్స్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఖూబ్సూరత్లో రేఖ పాత్రలో సోనమ్ కనిపిస్తుంది. అయితే అన్ని పాత్రలూ ఒకేసారి చేయడం కష్టమని, ఒకదాని షూటింగ్ ముగిశాకే మరోదాంట్లో నటిస్తున్నానని ఈమె తెలిపింది. ఇప్పటికీ
ప్రేక్షకుల మనసుల్లో ఉన్న రేఖ పాత్రలో నటించే అవకాశం రావడం అద్భుతంగా
ఉందని అనిల్ కపూర్ ముద్దుల కూతురు కూడా అయిన సోనమ్ చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్ లో పాగావేసిన డ్యాన్స్ మాష్టర్, దర్శకుడు, కొరియోగ్రాఫి గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభుదేవా .. సోనాక్షితో నడిపిని రొమాన్స్ గురించి బాలీవుడ్ బాబు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదే తరహాలో హీరో దనుష్ , సోనమ్ కపూర్ల విషయం ఉందని బాలీవుడ్ బాబులు అంటున్నారు.
No comments:
Post a Comment