30 కోట్లు పలికిన రజినీ సినిమా
సౌత్
ఇండియన్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ కి అటు తమిళంలో ఎంత మార్కెట్ ఉందో,
ఇటు తెలుగులో కూడా ఇంచు మించు అంతే మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు
తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో ’
తెలుగు హక్కులు భారీ రేటు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల
నుండి వినిపిస్తున్న వార్త ఏంటంటే... రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య
దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొచ్చాడయాన్ ’ తెలుగులో ‘విక్రమసింహ ’ పేరుతో
విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
విక్రమసింహసినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు 30
కోట్లు పెట్టి ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుబ్రమహ్మణ్యం కొన్నారని
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాక్. గతంలో ఈయన సుమారు 30 తమిళ, ఆంగ్ల చిత్రాలను
తెలుగులోకి డబ్ చేసి, లాభాలు గడించాడు. ఇప్పుడు ఈ సినిమాను ఇంత రేటు పెట్టి
కొన్నాడు. అయితే ఎంత రజినీ సినిమా అయినా డబ్బింగ్ హక్కులను ఇంత భారీ రేటు
పెట్టి కొనడం చాలా రిస్క్ అంటున్నారు తెలుగు సినిమా ట్రేడ్ పండితులు. ఈ
సినిమాను హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment