Thursday 27 December 2012

Great Honour To Bhanumathi And Savitri

bha_in
తెలుగు చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూపాలు ఆరెండూ. బహుముఖ ప్రజ్ఞాశాలి డా.భానుమతి క్రమశిక్షణతో, ప్రణాళికాబద్దంగా జీవితాన్ని మలుచుకొంటే, మహానటి sa_eసావిత్రి జీవితమంతా ఒడిదొడుకులతో ఇతరులకు పాఠంలా సాగింది. భానుమతి, సావిత్రి వర్ధంతి సందర్భంగా యువకళావాహిని సంస్థ  త్యాగరాయ గానసభలో స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహించింది. ఈ సభలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అభినయ శక్తికి గానశక్తిని సమ్మిళితం చేసిన ఘనత భానుమతిదేనని, అపూర్వమైన ఆమె స్వరం.. ఎవరూ అనుకరించలేని మధుర స్వరం అని ఆయన కొనియాడారు. మహానటి సావిత్రి, భానుమతి ఇద్దరూ సినీ రంగంలో ధృవతారల్లా వెలుగొందిన విదుషీమణులన్నారు. 
c
       భానుమతి రచయిత్రిగా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. మహానటి సావిత్రి అమాయకత్వానికి మారుపేరని, ఏ పాత్రకైనా తన అభినయంతో, హావభావాలతో న్యాయం చేసేవారన్నారు. వెండితెరపై వెలుగొందిన ఆమె చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపారని, దాన గుణం ఎక్కువగా ఉన్న సావిత్రి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం, గణపాఠం లాంటిదన్నారు.
       ఈ సందర్భంగా అనంతరం ‘మహా నటి సావిత్రి’ పుస్తక రచయిత్రి పల్లవిని ఘనంగా సత్కరించారు.
...avnk

Wednesday 26 December 2012

Actress December 31st Music Night Party

actress music december 31 night

        చిత్ర పరిశ్రమల అన్నింటిలోను తారమణులు తొందరపడిపోతున్నారు. ముందుగానే  బుకింగ్ పేరుతో బాగా దండుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు  ఆ రాత్రి కోసం  ఎదురు చూస్తున్నాయి.  ఆ  రాత్రి  కోసం ఎంతైన ఖర్చుపెట్టడానికి  వెనకడుగు వేయటం లేదు.  ఆ రాత్రి కోసం నటీమణుల రేట్లు  లక్షలు  నుండి కోట్ల వరకు ఉన్నట్లు  చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు.  నటీమణులు కూడా  ఒక్క రాత్రికే కదా,  అని వచ్చిన ఆఫర్లను వదులుకోవటం లేదట.  అయితే భారీగానే రేట్లు పెంచి చెబుతున్నారు.  అక్కడిదాక  వెళ్లిన వారు  ఆమె రేటు చూసి భయపడి బయటకు వచ్చిన, చివరకు మనసులో ఉన్న కోరికతో రాజీపడి,   ఆ హీరోయిన్  అడిగినంత ఇచ్చి  బుకింగ్ చేసుకుంటున్నారని  చిత్రపరిశ్రమలో  టాక్.  అయితే టాలీవుడ్ లో   ఇప్పటికే కొంత మంది హీరోయిన్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది,  అనుష్క, తమన్నా, సమంత , లాంటి పేర్లు  టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.  వీరు ఆ రాత్రి కోసం భారీగానే  రేమ్యూనరేషన్  తీసుకున్నట్లు  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
actress music december 31 night
అటూ బాలీవుడ్ భామలు కూడా భారీ రేంజ్ లో  తమ ఖాతాలను  ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరోయిన్స్  కత్రిన కైఫ్,  సోనాక్షి, లాంటి  వారికి మంచి డిమాండ్ ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి. కరీనా కపూర్ కు పెళ్లి జరగటంతో  ఆ స్థానం కత్రిన  సొంతం చేసుకుందని  బాలీవుడ్  బాబులు  అంటున్నారు.   చాలా మంది నటీమణులు  సినిమాల కంటే  ఈ రాత్రి బిజినెస్ చాలా బాగుందని   చెప్పుకుంటున్నారని టాక్.  ఒక్క రాత్రికి  భారీ మొత్తంలో   ఆదాయం రావటంతో.. హీరోయిన్స్  ఆ రాత్రి వైపు చూస్తున్నట్లు  చిత్ర పరిశ్రమల టాక్. అయితే ఇంతకీ  ఆ రాత్రి ఏమిటో  మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి. అదేనండి డిసెంబర్ 31 రాత్రి కోసం నటీమణులు మనీ కోసం బుకింగ్  అవుతున్నారట.  ఈ బుకింగ్ లో  అడ్వాన్స్ గా భారీ మొత్తంలో  తీసుకుంటున్నట్లు సినీ ప్రజల టాక్.  కొంత మంది హీరోయిన్స్ అయితే  ఇంటి ముందు  బుకింగ్ బోర్డులు పెట్టినట్లు గా సినీ  ప్రజలు అనుకుంటున్నారు. 

Chiranjeevi Appreciate Minugurulu Movie

min_innee
       
     విభిన్న కథాంశంతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘మిణుగురులు’. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రసంశలతో ముంచెత్తారు. సినిమా ఆద్యంతం హృదయానికి హత్తుకునే విధంగా ఉందని, అంథ బాలలచే చక్కని కథ, కథనాలతో దర్శకుడు అయోధ్యకుమార్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా రూపొందించారని చిరు ప్రశంసించారు. అంతేకాదు.. ఇటువంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయన్నారు.
       అయోధ్యకుమార్ కృష్ణంరెడ్డి స్వీయ దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా ‘రెస్‌ఫెక్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాని కేంద్ర మంత్రి చిరంజీవి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో రెండుగంటలసేపు చూశారు. మరో కేంద్ర మంత్రి కిల్లి కృష్ణారాణి కూడా సినిమాచూసి చిత్రవర్గాన్ని అభినందించారు. హీరోగా నటించిన మాస్టర్ దీపక్ చాలా బాగాచేశాడని కితాబిచ్చారు.
      అయోధ్యకుమార్ మాట్లాడుతూ ‘మా చిత్రాన్ని చూడ్డానికి, మాకు ఉత్సాహాన్ని కలిగించడానికి మెగాస్టార్ రావడం సంతోషంగా ఉందని, ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా రూపొందించడం జరిగిందని అన్నారు.        
        దీపక్, సుహాసిని మణిరత్నం, అశిష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్ ముఖ్యతారాగణం.
...avnk

Tuesday 25 December 2012

KCR Focus Tollywood Actress Anushka

kcr focus  tollywood actress anushka

        టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు  రాబోయే  ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని కొత్త పావులు కదుపుతున్నారు.  అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కొంత మంది రాజకీయ నాయకులు చేరటంతో  పార్టీ వర్గాలు ఆనందంగా ఉన్నా, కేసిఆర్ మాత్రం పార్టీ నుండి వారిపై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.  ఇప్పటికే  తెలంగాణ రాములమ్మ లో టీఆర్ఎస్ పార్టీ  అటూ ఇటూ ఊగుతూ అడుగులు వేస్తున్న విషయం కేసిఆర్ కు తెలుసు. రాములమ్మ పార్టీ దూరం అయితే  వచ్చే నష్టం కూడా ముందే పసిగట్టాడు కేసిఆర్. అందుకోసం చెల్లెమ్మ వెళ్లిపోతే .. ఆ స్థానంలో  మరో సినీ గ్లామర్ ఉన్న హీరోయిన్ కోసం  కేసిఆర్ ఫిలింనగర్లో తిరుగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.   ఇప్పటికే రాములమ్మ గులాబీలపై మోజు పోవటంతో.. కమలం పై కన్నుపడినట్లు తెలుస్తోంది.  మెదక్ జిల్లా ఎంపీ విజయశాంతి కి టీఆర్ఎస్ పార్టీ వల్ల పెద్ద ఒరిగింది ఏం లేదని ఆమె తన సన్నిహితులు వద్ద చెబుతున్నట్లు సమాచారం.  రాములమ్మ కమలనాధులతో కలిసి రహస్య పార్టీలకు హజరవుతున్నట్లు  కేసిఆర్ కు తెలియటంతో.. ముందు జాగ్రత్తగా  రాములమ్మకు పోటీగా ఉంటే  సినీ గ్లామర్  రుద్రమదేవి మీద మనసు నిలిపినట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. విజయశాంతి  ఓసేయ్ రాములమ్మ సినిమా తీసి  తెలంగాణ ప్రజలకు దగ్గరైనట్లే  ఇప్పుడు టాలీవుడ్  టాప్ హీరోయిన్  అయిన  అందాల అనుష్క కోసం కేసిఆర్ రాజకీయ ప్లాన్ వేస్తున్నట్లు ఆ పార్టీ రాజకీయ నాయకులు అంటున్నారు. 

kcr focus  tollywood actress anushka

  అనుష్కది తెలంగాణ ప్రాంతం కాకపోయిన, ఆమె నటిస్తున్న ‘రుద్రమదేవి’  సినిమా  తెలంగాణ ప్రజలకు , కాకతీయ వంశానికి చెందటంతో అనుష్క కోసం కేసిఆర్ పావులు కదుపుతున్నారు.  ఆ సినిమా ఇప్పడు షూటింగు జరుగుతుంది. ఆ సినిమా విడుదలయ్యేనాటికి  రాష్ట్రం ఎన్నికల వాతవరణం వస్తుంది కాబట్టి,  రుద్రమదేవిని  తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కేసిఆర్ ఇప్పటి నుంచి  గులాబీలు  తయారు చేస్తున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. అన్నీ రాజకీయ పార్టీల్లోను  సినీ గ్లామర్ పుష్కలంగా ఉన్న విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీలో  మెగా గ్లామర్, టీడీపీలో  నందమూరి వారి గ్లామర్, ఇక రీసెంట్ గా వచ్చిన  వైకాపా పార్టీలో  అక్కినేని, ఘట్టంనేని, దర్శకులతో  సీని గ్లామర్ నిండిపోయింది.  ఇక మిలిగింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికి వరకు రామలమ్మ గ్లామర్ తో  చెల్లెమ్మ అనే బిరుదుతో  కేసిఆర్ నెట్టాకొచ్చారు. కానీ ఇక నుండి అలా రాములమ్మ వెళ్లిపోతే  సినీ గ్లామర్ లేని పార్టీ గా మిలిగిపోతుందన భావించి  ముందుగా  రుద్రమదేవికి  గులాబీల తీవాచీ పరుస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ అనుష్క కేసిఆర్ ఇచ్చే గులాబీలు తీసుకుంటుందో..లేక ఆయన చేవిలో ఆ గులాబీలు పెడుతుందో చూడాలి. కేసిఆర్ మాత్రం బొమ్మాళీ నిన్ను వదల అంటూ వెంటపడి సాధిస్తాడో  చూడాలి...

Chiranjeevi At Nayak Movie Sets

charmi item song in nayak

   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , వివివినాయక్  దర్శకత్వంలో షూటింగ్ జరుపుకోని ఇటీవల  భారీ ఎత్తున్న  ఆడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాయక్  సినిమా లో  మంచి మాస్ పాట కోసం  సాక్కుబాయ్ ఒక పాటను  చిత్రీకరిస్తున్నారు.  డమరూకం సినిమాలో  నాగార్జునతో  ఐటమ్ సాంగ్ లో కనిపించిన  సాక్కుబాయ్ గరం చాయ్ అంటే  అందరికి వేడిపుట్టించిన హీరోయిన్ చార్మి. ఇప్పుడు నాయక్ సినిమాలో కూడా  ఒక గరం గరం పాట కోసం  దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటలో షూటింగ్ జరుగుతున్న సమయంలో  కేంద్ర మంత్రి, మెగా స్టార్  చిరంజీవి షూటింగ్ షెట్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.  షూటింగ్ లో సన్నివేశాలను  చిరంజీవి పరిశీలించినట్లు సినిమా యూనిట్ సభ్యుల టాక్.

charmi item song in nayak

అయితే  దర్శకుడు వివివినాయక్ , మెగా స్టార్ చిరంజీవి తో చాలా సేపు మాట్లాడుకోవటం జరిగిందని  యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే  ఈ సందర్భంలోనే   నటి ఛార్మి  పుల్ మేకప్ తో సెట్ రావటంతో  అందరి చూపులు ఛార్మిపైపడ్డాయట.  అయితే  సెట్ లో చిరంజీవి ఉన్న విషయం తెలుసుకోని  వెంటనే ఛార్మి  చిరంజీవికి నమస్కారించి తన పక్కన కూర్చిలో కూర్చోటం జరిగినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  అయితే ఆ సమయంలో  చిరంజీవి, ఛార్మిల మద్య హాస్యంతో  కూడిన మాటల సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలో  చార్మి చిరంజీవిని  ఒక కోరిక కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

Chiranjeevi-at-Nayak-Movie-Sets-2

ఆ కోరిక ఏమిటయ్య అంటే.. చిరంజీవి 150వ చిత్రం  వివివినాయక్ దర్శకత్వలోనే చార్మిహీరోయిన్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగినట్లు యూనిట్ సభ్యులు  అంటున్నారు.  చార్మి కోరికను విన్న మెగా స్టార్  చిరంజీవి  ఆనందంగా నవ్వుతూ ఆమె భూజం మీద చేయి వేసి  అలాగే చేద్దాం అని చెప్పినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చేవులుకోర్కుకున్నారు.  చిరు చేయి  చార్మి పై పడిన వెంటనే ఆమె లో  150 మెగా పవర్  తాకిన ఆనందంలో  లేచి నిలబడి  తన డ్రెస్సెను సరిచేసుకున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నాయక్ సినిమాలో  కూడా ఐటమ్ సాంగ్ హిట్ అయితే మాత్రం చార్మి ఐటమ్ గాళ్ల్ టాలీవుడ్ లో  ఉంటుందని  ఫిలింనగర్ ప్రజలు  అనుకుంటున్నారు.

charmi item song in nayak



Saturday 22 December 2012

Bindu Madhavi Movie Updates

9
       
              బిందుమాధవి.. అదేనండీ.. 'ఆవకాయ్ బిర్యాని' తో తెలుగు ప్రేక్షకులకు ఘుమ ఘుమలందించిన చిన్నది. ఇప్పుడు బిత్తరపోయిందంట.. ఏసందర్భంలో అనుకుంటున్నారా.. గతంలో విజయ కాంత్ హీరోగా చేసిన సూపర్ హిట్ 'సట్టం ఒరు ఇరుట్టరై' మూవీని  ఇటీవల హీరో విజయ్ తన సొంత బ్యానర్లో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయన నటించలేదు. తమన్ కుమార్, బిందుమాధవి, రీమాసేన్, పియా బాజ్ పేయి  పాత్రలు పోషిస్తున్నారు.
       ఈ సినిమాకి సంబంధించి ఓ పాటను బిందుమాధవి పై చిత్రీకరిస్తూ వుండగా, అక్కడికి హీరో విజయ్ వచ్చాడట. అతను మంచి డాన్సర్ కావడంతో విజయ్ వెళ్లిపోయాక డాన్స్ చేస్తానంటూ బిందు మొండికేసిందట. విషయం తెలుసుకున్న విజయ్,  ఆమె డాన్స్ చూసే వెళతానని మొరాయించాడట. దాంతో బిందు మాధవికి ఆయన ఎదుట స్టెప్పులు వేయక తప్పలేదు. అయితే ఆమె పాట చిత్రీకరణ పూర్తయ్యాక, చాలా బాగా చేశావంటూ విజయ్ ఆమెను అభినందించాడట. ఈ విషయన్ని ట్వీటిచ్చి మరీ సంబరపడిపోతుంది బిందు.
8
        ఈ సంగతిలా ఉంటే, ఈ చిత్ర షూటింగ్ హాంకాంగ్ లో జరుగుతున్నప్పుడు హెలికాప్టర్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, బిందుమాధవి, మరో నటి పియా బాజ్ పాయ్.. చాపర్ నుంచి జారి కింద పడిపోవడంతో వీరిద్దరికీ దెబ్బలు తగలటంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడి మళ్లీ ఇప్పడు జోరందుకుంది. అంతేకాదు ఈ చిత్రం అనుకున్నప్పటి నుంచీ బిందు ఏదో ప్రమాదంలో పడుతుండటం గమనార్హం. సెప్పెంబర్ మొదటి వారంలో బిందు మాధవి తమిళనాడులోని తిరుచునాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకుని బయటపడింది.

Friday 21 December 2012

Dasari Narayana Rao Sensational Comments

dasari narayana rao makes sensational comments

  చిరంజీవి నా బిడ్డ లాంటివాడు ,  మా ఇద్దరికీ గొడవలున్నాయనే రీతిలో మా మధ్య వర్గ పోరాటం  ఉన్నట్టుగా  మీడియా వారు చిత్రికరిస్తున్నారని ప్రముఖ దర్శకుడు  దాసరి నారాయణ రావు అన్నారు.   అయితే నా దగ్గర ఎంతో  మంది సాయం పొందారు. వారికి అది గుర్తులేక .. ఫంక్షన్లకు  దాసరి వస్తే  నేను లేవాలా?  అంటున్నారు.  నాతో చాలెంజ్ చేసి మాట్లాడే స్టార్స్  వచ్చారు.  నా ఇంటి చుట్టూ సైకిల్  వేసుకుని  తిరిగిన వారిని నేను మర్చిపోలేదు.   ఎండుగడ్డి  ఉన్న స్టూడియోలో  పచ్చగడ్డిని  మొలిపిస్తే  అక్కడి నుంచి  నన్ను బయటకు గెంటారు.  ఆ విషయాన్ని  నా ఆత్మకథలో  రాయాలా వద్దా?  ఐదేళ్ల నుంచి  ఆత్మకథ రాసే ప్రయత్నం  జరుగుతోంది.  ఎవరినీ నొప్పించకుండా ఆత్మకథ రాస్తా.  ఆత్మ కోసం 6400 ఫొటోలను  సేకరించాను  అని దాసరి  నారాయణరావు చెప్పారు  నిన్న ఒక పుస్తక ఆవిష్కరణలో  ఆయన చిత్రపరిశ్రమపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే  ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత మంది సినీ నటులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఎందరో సూపర్ స్టార్లు  అమితాబ్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్  లాంటి వారు కూడా  రజనీకాంత్ సూపర్ స్టార్ అని  కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలుగులో  ఎన్టీఆర్  , తమిళ్ లో  ఎంజీఆర్ , కన్నడంలో రాజ్ కుమార్  వంటి వారందరూ  అంతే.   సూపర్ స్టార్ కన్నా గొప్పవాళ్లు  ఎవరు ఉండని దాసరి అన్నారు.  అయితే రజనీకాంత్  ఒక్కడే  సూపర్ స్టార్  అని దాసరి  వ్యాఖ్యానించడం పరోక్షంగా  చిరంజీవిని  అవమానించడమేనని మెగా స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం  చేశారు.  దీనిపై  చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు , దాసరి తో ఫోన్ లో  మాట్లాడినట్లు తెలుస్తోంది. 

dasari narayana rao makes sensational comments

   దాసరి వ్యాఖ్యలు   చిరంజీవిని  ఉద్దేశించి చేసినట్లు తనకేమీ అనిపించలేదని  నాగబాబు అన్నారు.  తన సోదరుడు  స్వీయ ప్రతిభతోనే చిత్రసీమలో   ఉన్నతస్థానానికి  ఎదిగినట్లు  నాగబాబు తెలిపారు.  అన్నయ్యని  అన్నట్లు అనిపించలేదు.  అన్నయ్య ఫిలిం ఇన్ స్టిట్యూట్ కు   అప్లైచేసి , తన సొంతంగా ఎదిగారు.  దాసరి  ప్రస్ర్టేషన్ లో అలా మాట్లాడి ఉండోచ్చు దాన్ని పట్టించుకోవక్కర్లేదు   ఆయనకు ఆ ప్రస్ట్రేషన్  ఎందుకు వచ్చిందో  నాకు  తెలీదు.  అన్నయ్య మీద రాస్తే రాయనియ్యండి. అందరు రాస్తారు చరిత్రలు అని నాగబాబు మెగా అభిమానులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తర్వాత స్టార్లు లేరనే దాసరి గారి   వ్యక్తిగత అభిప్రాయంతో  నేను ఏకీభవించను.  కానీ  నేను కూడా కేవీరెడ్డి గారి తర్వాత  దర్శకులే లేరంటే అది నా వ్యక్తిగత అభిప్రాయమవుతుందని  నాగబాబు చాలా సింపుల్ అందరికి  అర్థం అయ్యే విధంగా చెప్పారు. నాగబాబు మాటలకు మెగా అభిమానులు  శాంతించినట్లు తెలుస్తోంది.  దాసరి కూడా చివరకు  చిరంజీవి  నా బిడ్డలాంటివాడు  , మా ఇద్దరి మధ్య గొడవలు  పుట్టడానికి కారణం మీడియాలో రాసే రాతలే కారణం అని ఆయన గొంతు సవరించుకుంటూ.. మీడియా పై దాసరి నిప్పులు కురింపించారు.  ఈ దాసరి వివాదం ఇంతటి ఆగిపోతుందో , లేక ఎక్కడివరకు వెళ్ళుతుందో  చూడాలి.  

dasari narayana rao makes sensational comments

   టాలీవుడ్ లో  దాసరి మాటలకు  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాసరి  చిరంజీవిని , అక్కినేని వారిని టార్గెట్ చేసిన మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఏమైనా దాసరి అలా మాట్లాడి ఉండకూడదని సినీ పండితులు అంటున్నారు.  తెలుగుతో  ఎన్టీఆర్  తరువాత స్టార్లు లేరని అనటం ఆయన పెద్దరికాన్ని  కోల్పోతున్నాడనే అనే భావన కలుగుతుంది. తెలుగులో సీని దర్శకుడు అయిన దాసరి వ్యాఖ్యలు  చేసేటప్పడు  టాలీవుడ్ వర్గాలను దుష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని  సినీ పండితులు అంటున్నారు.  ‘‘ పెరటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదనే’’  సామెతను దాసరి మాటలు గుర్తుచేస్తున్నాయాని .. సినీ రచయితలు  అంటున్నారు. ఈ వయసులో  దాసరి  ఎదిగేవారికి ఆయుధం కావాలి, గానీ  అడ్డం కాకూడదని సినీ పెద్దలు అంటున్నారు. జనరేషన్  మారుతున్న కొద్ది  కొత్త వాటిని ఆహ్వానించక తప్పదని సీనీ ప్రముఖులు అంటున్నారు.  ‘‘మా తాతలు  నేతిని తాగారు.. మా మూతులు వాసన చూడండి’’ అనే   రోజులు కావు అని దాసరి తెలుసుకోవాలని సినీ పండితులు అంటున్నారు. 

Surya Trisha Kanchu Movie


kan_in


kanchu-press-note

Ram Charan With Hot Charmi

chh
      
                హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ముద్దుగుమ్మ చార్మీ ఐటెం సాంగుల వెంట పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇటీవలే 'సక్కూభాయ్ ...గరమ్ చాయ్...' అంటూ 'ఢమరుకం' సినిమాలో హాట్ హాట్ గా సందడి చేసిన చార్మి త్వరలో చరణ్ తో కలిసి చిందేయబోతున్నట్టు వినికిడి. రామ్ చరణ్ హీరోగా వీవీ వినాయక్ రూపొందిస్తున్న భారీ చిత్రం 'నాయక్' లో ఓ ఐటెం పాటలో నటించడానికి చార్మీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ హైదరాబాదులో సెట్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
         చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న నాయక్ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
daaa
        ఇదిలా ఉంటే,  ఇటీవల 'నాయక్' ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాటతీరు, అనంతరం చోటుచేసుకున్న మీడియా వ్యాఖ్యానాలమీద చరణ్ బాబాయ్ నాగబాబు స్పందించారు. చరణ్ వయసులో చాలా చిన్నవాడనీ, అతని ఆవేదనను అర్ధం చేసుకోవాలే గానీ, ఆవేశాన్ని తప్పుపట్టడం భావ్యం కాదని అన్నారు. ఏదేవైనా చరణ్ తొందరపడి మాట్లాడినందుకు అతని తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
nagaaa     ఆఖరి మజిలీ :  నిన్న పుస్తకావిష్కరణ సభలో దాసరి చేసిన ప్రసంగం అనంతరం చోటుచేసుకున్న గుసగుసలకు అనూహ్యంగా శుభంకార్డు పడింది. ఎలాగంటే.. దాసరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమం నడుస్తుండగా, సదరు చానల్ కి దాసరి ఫోన్ చేశారు. చిరంజీవితో తనకి ఎలాంటి విబేధాలు లేవనీ, తాను చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదని తేల్చిచెప్పటం కొసమెరుపు.
...avnk

Ram Charan Nayak Video Song Leaked

ram charan angry over nayak video song leaked

     నాయక్  ఆడియో ఫంక్షన్ లో  మీడియా పై రెచ్చిపోయిన రామ్ చరణ్ గురించి తెలిసిందే. రామ్ చరణ్ లో  ఆపైర్ , ఆ పవర్ ఇంక తగ్గలేదని అంటున్నారు టాలీవుడ్ వాసులు. నాయక్ ఆడియో ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా విడుదల చేసినవిషయం తెలిసిందే. అయితే  ఆడియో పాటలతో  పాటు  నాయక్ సినిమాలో  ఒక వీడియో సాంగ్   యూట్యూబ్ నుండి , ఫేస్ బుక్  అంతటా హల్ చల్ చేస్తోందని  సినీ అభిమానులు  అంటున్నారు.  అయితే  నాయక్ సినిమాలో  ఆ సాంగ్ కోసం రామ్ చరణ్  , హీరోయిన్లు చాలా కష్టపడి  డ్యాన్సు చేసినట్లు తెలుస్తోంది.  ఆ సాంగే  ఆ సినిమాకు మంచి హైలెట్ అని సీనిమా యూనిట్ సభ్యులు అంటున్నారు.  కానీ అలాంటి సాంగ్ ను ఎవరు లీక్ చేశారో తెలియాదు గానీ నెట్ లో మాత్రం నాయక్ వీడియో సాంగ్  రచ్చ రచ్చ చేస్తుంది.  దీని పై మోగా అభిమానులు నిరాశ గా ఉన్నారు. 
ram charan angry over nayak video song leaked
తమ అభిమానా హీరో సినిమా విడుదల కాకముందే ..ఇలా నెట్ లో రావటం పై అందరు నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న  రామ్ చరణ్   తన సిబ్బందిని పిలిచి  మండిపడినట్లు  టాలీవుడ్ టాక్.  అంతేకాకుండా  ఒకరిద్దరిపై  రామ్ చరణ్  చేయి కూడా చేసుకున్నాడని  ఫిలింనగర్లో  పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  మేము ఒళ్లు హూనం చేసుకుని  కష్టపడి చేసిన  డ్యాన్స్ ని  తెరపై కాకుండా  ఇలా ఫ్రీ గా బయటకు రావటం పై రామ్ చరణ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో  ఈ వీడియో సాంగ్ ను లీక్ చేసిన వ్యక్తుల కోసం  రామ్ చరణ్ వివరాలు సేకరిస్తున్నట్లు మెగా అభిమానులు అంటున్నారు.

Allari Naresh Match Fixing

allari naresh

టాలీవుడ్  బ్రహ్మచారులకు అందరికి పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి. ఇక టాలీవుడ్ మిగిలింది ఎవరు అంటే   ఒకరు  హీరో  ప్రభాస్,  మరోకరు అల్లరి  నరేష్.  యంగ్ హీరోలు  అందరు ఒక్కొక్కరిగా  పెళ్లి చేసేకుంటూ  లైప్ లో  వైఫ్ తో హ్యాపీగా  సెటిల్  అవ్వాలనే చూస్తున్నారు.  రీసెంట్  హీరో  నానీ కూడా తన జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాడు.  ఈరోజు  హీరో గోపిచంద్  కూడా ఒక ఇంటివాడు   కాబోతున్నాడు.  హీరో గోపిచంద్ , హీరో శ్రీకాంత్ త్వరలో బంధువులు అవుతున్నారు.  ఆ రెండు కుటుంబాలు  ఒక్కటవుతున్నాయి. ఇక ఒంటిరిగా మిగిలింది. అల్లరి నరేష్ , ప్రభాస్,  హీరో ప్రబాస్  అప్పుడే పెళ్లి తొందరలేదని చెబుతున్నాడు.  ఇక అల్లరి నరేష్ వంతు.   ఇప్పటికే తన అన్న  ఆర్యన్  రాజేష్  తన తమ్ముడి కోసం  అమ్మాయిలను వేతికే పనిలో ఉన్నాడని  టాలీవుడ్  టాక్. 
allari naresh
  
  ఇంచుమించు అల్లరి నరేష్ కూడా  ఇటీవల  కొన్ని ఫంక్షన్లు వద్ద పెళ్లికానీ అమ్మాయిల వైపు  ఆశగా చూస్తున్నాడట,  నచ్చిన అమ్మాయి కోసం కొన్ని ఫంక్షన్లకు  పిలవకపోయిన  అల్లరి నరేష్ పనికట్టుకొని పెళ్ళికి వచ్చిన అమ్మయిలను చూస్తున్నాట్లు ఫిలింనగర్ పుకార్లు వినిస్తున్నాయి.  అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్  మాత్రం  పల్లెటూరి అమ్మాయిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి అమ్మాయి అయితే  సాంప్రదాయంగా, పద్దతిగా ఉంటుందని  అల్లరి నరేష్ తల్లి అంటుంది. మన  బెండుప్పారావు మాత్రం రీసెంట్  ఒక బస్ స్టాప్ లో కూడా కాలేజీ అమ్మాయిల కోసం  బెండైనట్లు అతని సన్నిహితులు అంటున్నారు.  మరొకోన్ని   రోజుల్లో   అల్లరి నరేష్ కూడా  ఏదో ఒక అమ్మాయిన  సెలక్ట్  చేసుకోవటం ఖాయమాని  ఫిలీంనగర్ ప్రజలు అంటున్నారు.  త్వరలో  అల్లరికి పెళ్లి గంట మోగుతుంది.

Wednesday 19 December 2012

Deepika Padukune With Pawan Kalyan

dee_in
       
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బాలీవుడ్ సెక్సీ భామ దీపికా పదుకొనె నటించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందే సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కు మంచి స్టేచర్ వున్నా కథానాయిక అవసరం అవడంతో ఈ కలయిక షురూ కానుంది. దీనికి సంబంధించి ఆమెను కాంటాక్ట్ చేయగానే దీపిక వెనకాముందూ ఆలోచించక సై అన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కొచ్చాడియాన్' సినిమాలో కథానాయికగా నటిస్తూ దక్షిణాదిన అడుగుపెట్టిన ఈ అందాలభామ టాలీవుడ్ లోనూ తన సత్తా చాటితే చూడాలని తెలుగు చలన చిత్ర అభిమానులు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు.
...avnk

Ullasamga Utsahamga Hero Sagar Dead

yasho
      
    ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన యంగ్ హీరో యశో సాగర్ హఠాన్మరణం చెందాడు. కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లా సిరా ప్రాంతంలో కొద్దిసేపటిక్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాగర్ దుర్మరణం పాలయ్యాడు. సాగర్ అకాల మరణంతో టాలీవుడ్ చిత్రసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలుగు చిత్ర రంగం మీద ఉన్న మక్కువ.. తెలుగు భాష మాత్రుభాష కావటంతో సాగర్ టాలీవుడ్ మీదే ఎక్కువ ఆశక్తి చూపాడు.
    ఈ యాక్సిడెంట్ గురించి విన్న వెంటనే చిత్తూరుజిల్లా నుంచి సాగర్ తల్లి, కర్ణాటక నుంచి తండ్రి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
...avnk

Tuesday 18 December 2012

Badsha Shooting In Hyderabad

ntr-baadshah-movie-_in
       
               ఇంతవరకు కనిపించని కొత్తకోణంలో చాలా స్టైలిష్‌గా యంగ్ టైగర్ జూనియర్‌ యన్‌.టి.ఆర్‌ 'బాద్‌షా'లో కనిపించబోతున్నాడన్న సంగతి మనకు తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకాభిమానులు అన్నివిధాలా సంతృప్తిచెందేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
         మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు చక్కటి వినోదాన్ని కూడా మేళవించారట. ఇక కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం రెండు మేజర్‌ షెడ్యూల్స్‌ ను ఇటలీ, బ్యాంకాక్‌లలో పూర్తిచేశారు.
       కాగా నెగటివ్‌ పాత్రను పోషిస్తున్న నవదీప్‌ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. గత శ్రీను వైట్ల చిత్రాలలో బ్రహ్మానందం పాత్రలు ఎంతబాగా పండాయో వేరుగా చెప్పనక్కరలేదు. ఈ చిత్రంలో కూడా అత్యంత ప్రాధాన్యం వున్న పాత్రను ఆయన పోషిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రతినాయకుడిగా కెల్లి దోర్జి నటన చాలా స్పెషల్ అని వినికిడి. 
      బాద్‌షా చిత్రానికి తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, గోపీమోహన్‌, కోన వెంకట్‌లు స్క్రిప్టును అందిస్తున్నారు. కొత్త ఏడాది సమ్మర్‌ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది

Bunny Nani And Gowtham Menon Movie



bunny
      nani మొన్ననే 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రాన్నిచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ త్వరలో ఇద్దరు హీరోలతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతం స్వయంగా వెల్లడించాడు.  త్వరలో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-నాని కాంబినేషన్లో ఈ మల్టీ స్టారర్ తీయాలని వుందని గౌతమ్ అంటున్నాడు. దీనిని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీస్తానని చెప్పాడు. లవ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్రధానంగా దీనిని ప్లాన్ చేస్తున్నానని అంటున్నాడు.
        వేదం సినిమా కోసం విష్టుతో జోడీకట్టిన బన్నీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. కథ నచ్చకపోతే క్రుష్ణవంశీ అయితే ఏంటి అని ఇటీవలే స్టేట్ మెంట్ ఇచ్చిన నాని మనసు ఎటు వెళ్తుందో...
...avnk

Mega Power Ram Charans Nayak Audio Release

mega power ram charans nayak audio release

    మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్,  హీరోయిన్ కాజల్ , అమలాపాల్ , వినాయక్ దర్వకత్వంలో  నటించిన  సినిమా నాయక్.  నాయక్ ఆడియో ఫంక్షన్ వేడుక  అభిమానుల సందడితో ఘనంగా జరిగింది.  అయితే నాయక్ ఆడియో ఫంక్షన్ కు  కేంద్ర మంత్రి  మెగా స్టార్  చిరంజీవి  రాకపోవటంతో అభిమానులు  కొత్త నిరాశ చెందారు. అయితే  మెగా స్టార్  చిరంజీవి స్థానంలో .. ఆయన సతిమణి  రామ్ చరణ్ తల్లి సురేఖ రావటంతో .. నిరాశతో అభిమానులకు ఉపచమనం కలింగింది. నాయక్ ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  హాజరుకాడని కొన్ని మీడియా పత్రికలు  రాయటం జరిగింది.  అలాంటి మీడియా  పత్రికలకు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నోళ్లు మూయించారు.  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రాకతో  మెగా అభిమానులు మరింత ఉత్సహంగా కనిపించారు. పవన్ రాకతో  ఒక్కసారిగా  ఫంక్షన్ హాలు మొత్తం  హర్షధ్వనులతో మారుమోగిపోయింది.  మెగా కుటుంబం నుండి  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  రామ్ చరణ్ తేజ్ , రామ్ చరణ్  భార్య ఉపాసన , చిరంజీవి సతిమణి సురేఖ, అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,  రామ్ చరణ్  సోదరి, పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ హాజరవ్వటంతో.. మెగా అభిమానులకు ఆడియో వేదిక మీద మెగా కుటుంబాన్ని  చూసే అద్రుష్టం కలిగింది. 

mega power ram charans nayak audio release

   ఆడియో ఫంక్షన్ కు ఇద్దరు  అందాల భామలతో  వేదిక మరీ అందంగా తయారైంది. హీరోయిన్ కాజల్  పసుపు వర్ణం డ్రెస్ తో  మెగా అభిమానులకు కనువింద్ చేసింది. నాయక్ సినిమాలో  సెకండ్ హీరోయిన్ అయిన  అమలా పాల్.. ఎరుపు రంగు సెక్సీ డ్రెస్ లో  మెగా అభిమానులకు మతిపొగట్టింది. ఆడియో ఫంక్షన్ లో  రామ్ చరణ్  కొంచెం ఆవేశానికి గురైనట్లు తెలుస్తుంది.  రామ్ చరణ్  మాట్లాడుతూ  నాన్న ఈ వేడుకకి రాలేకపోయిన  ఆ లోటుని  కళ్యాణ్ బాబాయ్  తీర్చారని ఉద్రేకంగా చెప్పారు.  మెగా ప్యామిలీలో  నాన్న తరువాత నేను కాదు.  ఆ స్థానం  పవన్  బాబాయ్ దే. ఆయన్ని ఎవరైనా  ఏమైనా అంటే   నేను ఊరుకోను  అని రామ్ చరణ్ ఆవేశంతో  ఉక్రోశంగా  అన్నారు. ఇటీవల కాలంలో  రచ్చ పాటల వేడుకకు బాబాయ్  రాలేదని  రకరకాల  కథనాలు  వినిపించారు.   వేదికపై  అఅందరు ఉంటేనే  మా మధ్య ప్రేమ ఉన్నట్టు కాదు.  మా మద్య ఎలాంటి  అనుంబంధం ఉందో   మాకు తెలుసు.  మా నాన్నకి , బాబాయ్ కి  మధ్య ఎలాంటి  అనుబంధం  ఉందో, నాకు బాబాయ్ కి మద్య ఎలాంటి ప్రేమ ఉందో మాకే తెలుసు.  నేను  చేయబోయే  తరువాత  సినిమా పాటల వేడుకకు  కూడా మా కళ్యాణ్ బాబాయ్  రాకపోవచ్చు.  అంతమాత్రానికే  మా మధ్య  ప్రేమ లేదనుకోవద్దు. 

mega power ram charans nayak audio release

   ఇలాంటి  లేనిపోని కథనాలు  వస్తే నేను పట్టించుకోను .  ఇలాంటి  విషయాలను  గురించి, ఓ పత్రిక, ఓ ఛానల్ ఏం రాసినా  అది నాకు  వెంట్రుకతో  సమానం అని రామ్ చరణ్ అన్నారు.   అంతేకాకుండా 37 యేళ్లుగా  మా మద్య ఉన్న  అనుబంధాన్ని  ఏ  ఛానల్  కూడా వీడదీయలేదని  చరణ్ అన్నారు.   వినాయక్  ఒక దర్శకుడు కాదు , నాకు ఇంకో బాబాయ్ లాంటి వాడన్నారు.   అయితే చివరిగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ   సరైన పరిస్థితుల, అవసరం  ఉంటే తప్ప నాకు  మాట్లాడాలని అనిపించదు.  అందరూ సంతోషంగా  ఉండాలి. చిత్ర పరిశ్రమలోని అందరూ కూడా   మా కుంటుంబలోని వారే.  రామ్ చరణ్   డ్యాన్సుల్ని   నేను ఎంతగానో  ఆస్వాదిస్తాను  అని పవన్ మాట్లాడటం జరిగింది.  కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం  ఆన్ లైన్ లో మాట్లాడి  మెగా అభిమనులను  ఆనందం నింపారు.  నాయాక్  ఆడియో తో   మెగా బ్రదర్స్ మద్య విభేదాలు లేవని  మెగా అభిమానులకు కోసం రామ్ చరణ్  చెప్పటం జరిగిందని  అన్నారు. 

mega power  ram charans nayak audio release