హీరోలకు హీరోల మీద అభిమానం ఉండటం చాలా
సహజం. కానీ వీరాభిమానం ఉండటం చాలా అరుదు. సాధారణ ప్రేక్షకులకు స్టార్స్ పై
ఎంత అభిమానం ఉంటుందో, హీరో నితిన్ కి కూడా పవన్ కళ్యాణ్ అంటే అంతే పిచ్చి.
ఈయన పై ఉన్న అభిమానంలో గతంలో ఆడియో ఫంక్షన్ కి గెస్టుగా పిలిపించుకున్న
నితిన్ ఈ సారి ఏకంగా ఆయన సినిమాలోని ఓ పాటనే అభిమానంతో రీమిక్స్
చేయించుకుంటున్నారు. నితిన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న 'గుండెజారి
గల్లంతయ్యిందే' సినిమా కోసం కల్యాణ్ హీరోగా నటించిన సూపర్హిట్ సినిమా
'తొలిప్రేమ'లోని 'ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి..' పాటని
రీమిక్స్ చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ని సీతారామశాస్త్రి రాయగా, దేవా
బాణీలు కట్టారు.
ఇప్పుడు రీమిక్స్కి అనూప్ రూబెన్స్
స్వరాలు కూరుస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి
నిర్మిస్తున్న 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి విజయకుమార్ కొండా
దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ తుది దశకు
చేరుకున్న ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ పాట
రీమిక్స్ తో పవన్ పై నితిన్ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడని
అనుకుంటున్నారు.
No comments:
Post a Comment