ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు అన్నీంటిలో
కమర్షియల్ హంగులు ఉంటున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అవసరం లేకున్నా
ఐటెం సాంగులు పెట్టడం, సినిమాకు హైప్ తీసుకురావడానికి ప్రముఖులతో వాయిస్
ఓవర్ లు చేయించడం కామన్ అయిపోయింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా
సినిమాకి ప్రిన్స్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఎవడు ’ చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని టాలీవుడ్ ఫిలిం వర్గాల సమాచారం. రామ్
చరణ్ ‘ఎవడు ’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ కార్యక్రమాలు
మొదలు పెట్టింది. ఈ సినిమాకి పవన్ వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్రాక్షన్ గా
ఉంటుందనే ఉద్దేశ్యంతో పవన్ ని సంప్రదించారట. అబ్బాయి చరణ్ కోసం పవన్ వెంటనే
ఒప్పుకున్నాడని సమాచారం. గతంలో పవన్ మహేష్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన
విషయం తెలిసిందే.
No comments:
Post a Comment