Tuesday 14 October 2014

విశాఖలో ఇవాళ పవన్ కళ్యాణ్, జగన్ పర్యటనలు

హుద్ హుద్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించటంతో పాటు.. బాధితులను పరామర్శిస్తారు. తుఫాను వల్ల జరిగిన నష్టం.., పునరావాస, సహాయక కార్యక్రమాలపై బాధితుల నుంచి వివరాలను సేకరిస్తారని సన్నిహితులు తెలిపారు. నగరంలోనే ఉండి సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తుఫాను బాధితుల సహాయార్ధం పవన్ రూ.50లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

For Updates log on to www.teluguwishesh.com

No comments:

Post a Comment