Bollywood Directors Eye Mahesh Babu For Next Movie
టాలీవుడ్
లో బిజీ హీరో అయిన మహేష్ బాబు త్వరలో బాలీవుడ్ దర్శకులతో
నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు అయిన రాజ్
నిడిమోరు, కృష్ణ డీకే బాలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం
వహించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ హీరోగా 'గో గోవా గాన్' అనే సినిమాను
తెరకెక్కించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత ఏ విధంగా చెడిపోతుందనే
కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం దిశగా
దూసుకుపోతోంది. తెలుగులో అరంగ్రేటం చేయాలని భావిస్తున్న వీరు ఇటీవలే భారీ
యాక్షన్, ఎంటర్ టైన్ తో కూడిన కథను మహేష్ కి వినిపించారట.
ఈ కథ విన్న మహేష్
కి స్టోరీనే కాకుండా, గో గోవా గాన్' ప్రచార చిత్రాలు మహేష్ ని ఎంతగానో
ఆకట్టుకున్నాయట. దీంతో వీరితో నటించేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని
ఫిలిం నగర్ జనాల నుండి అందిన సమాచారం. ప్రస్తుతం వారు చేస్తున్న సినిమా
పూర్తవగానే మహేష్ తో సినిమా చేయడానికి హైదరాబాద్ వస్తారట.
No comments:
Post a Comment