జులాయి ముచ్చటగా మూడో అమ్మాయితో హాట్ రొమాన్స్
ఇప్పటికే జులాయి ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ముద్దు గుమ్మలే, కాకుండా మూడో భామతో రొమాన్స్ కు సిద్దమయ్యాడు జులాయి. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ముచ్చటగా మూడో అమ్మాయి ప్రవేశించింది. అల్లు
అర్జున్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్
ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైటిల్కు
అనుగుణంగా అమలాపాల్, కేథరిన్ నాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే బ్యాంకాక్, స్పెయిన్
వంటి లొకేషన్లలో భారీ షెడ్యూల్స్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో మూడవ
హీరోయిన్గా బాలీవుడ్ భామ కాజల్ వశిష్ట్ నటిస్తున్నట్లు విశ్వసనీయంగా
తెలిసింది. కథానుసారమే మూడవ నాయికను కూడా తీసుకున్నారట. ఇంతవరకు ఈ విషయాన్ని ఫోకస్ చేయకపోయినప్పటికీ, అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొంత చిత్రీకరణను జరిపారని అంటున్నారు. ప్రభుదేవా హిందీ చిత్రం 'రౌడీ రాథోడ్'లో నటించిన ఆమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఎందరో ఉత్తరాది భామల కోవలో తాను కూడా టాలీవుడ్లో బిజీకావాలని కాజల్ వశిష్ట్ కోరుకుంటోంది. నటనకు
అవకాశం వున్న చక్కటి పాత్రలు పోషించాలని అనుకుంటున్న తనకు ఐటెం సాంగ్స్
చేయాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని కాజల్ వశిష్ట్ స్పష్టంచేస్తోంది. ఇక 'దేశముదురు' తర్వాత అర్జున్, పూరీల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. తన చిత్రాలకు కాస్త భిన్నంగా ఉండేలా పూరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, అమోల్రాథోడ్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
No comments:
Post a Comment