ప్రేమా
దోమా అంటూ పలువురు హీరోలతో తిరిగి, అవన్నీ బెడిసికొట్టిన తరువాత మళ్ళీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్. ఈమెకు
ఎన్ని రిమార్కులు ఉన్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటు హీరోయిన్ గా
బిజీగా ఉంటూనే మరో ప్రక్క ఐటెం సాంగులు కూడా చేయడానికి రెఢీ అయింది. తాజాగా
ఈ అమ్మడును ఐటెంసాంగులో నటించమని అడిగారట నిర్మాతలు. ఐటెం సాంగు చేయడానికి
గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గానీ పారితోషికం మాత్రం నయనతార భారీగా డిమాండ్ చేసిందట. ఈ అమ్మడు ఐటెం సాంగు కోసం అడిగిన మొత్తం ఎంతో తెలుసా అక్షరాల యాభై
లక్షలు. దీనికి ఒక్కరూపాయి కూడా తగ్గినా ఐటెం సాంగు చేయనని తెగేసి
చెప్పడంతో సదరు నిర్మాతలు బెంబేలెత్తి పోయారట. అంతే కాకుండా కొన్ని
కండీషన్లు కూడా పెట్టి వాటికి ఒప్పుకుంటేనే చేస్తానని చెప్పడంతో సదరు
నిర్మాతలు వెనెక్కి వెళ్ళిపోయారట. నయన డిమాండ్ ఉన్నప్పుడే పైసలు
రాబట్టుకోవాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందని సినీ జనాలు
అనుకుంటున్నారు.
No comments:
Post a Comment