టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ చిత్రాల దర్శకుడు
పూరీ జగన్నాథ్ సినిమాలు అంటేనే మనకు గుర్తొచ్చేది ఐటెం సాంగ్. ఈయన ప్రతి
సినిమాలో ఐటెం సాంగ్ తప్పనిసరి. పూరి అంటే ఐటెం సాంగ్... ఐటెం సాంగ్ అంటే
పూరి. అలాంటి పూరి జగన్నాథ్ తాజాగా అల్లు అర్జున్ తో తీస్తున్న
‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమాలో ఐటెం సాంగు పెట్టడం లేదట. అదేంటి పూరి బాలీవుడ్
హాట్ భామ దేవషి కందూరితో ఓ ఐటెం సాంగు తెరెక్కించాడనే వార్తలు వచ్చాయి కదా
? అంటే ఈ సినిమా కథ ప్రకారం ఐటెం సాంగు సెట్ కాదని, అందుకే ఐటెం సాంగు
పెట్టలేదని అంటున్నాయి యూనిట్ వర్గాలు.
దేవషీ కందూరి పై చిత్రీకరించిన పాట
కథలో సాగిపోతుందని అంటున్నారు. కొంత మంది సినీ జనాలు పూరీ ఐటెం పాటకోసమైనా
సినిమాకి వచ్చేవారు. అలాంటి వారికి ఈ సినిమాలో నిరాశ తప్పదనే చెప్పవచ్చు.
ఇకపోతే ఈ సినిమాలో బన్నీ సరసన అమలాపాల్, కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్న
విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 10
తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
No comments:
Post a Comment