ఇప్పటి
వరకు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి
రికార్డులు స్రుష్టించిన దర్శకుడు శంకర్ త్వరలో రజినీకాంత్ అల్లుడు ధనుష్
తో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా శకంర్ ఓ
ప్రాజెక్టు అయిన తరువాత మరో దాన్ని మొదలు పెడతాడు. కానీ ఈసారి ఓ సినిమా
సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన తమిళ
స్టార్ అయిన విక్రమ్ హీరోగా 100 కోట్ల బడ్జెట్ తో ‘ఐ ’ అనే సినిమా
తీస్తున్నాడు. దాన్నే తెలుగులో ‘మనోహరుడు ’ పేరుతో అనువదిస్తున్నారు. శంకర్ ధనుష్ తో తీసే సినిమాకు సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని, ఏజీఎస్ సంస్థ ఈ
సినిమాని నిర్మించబోతుందని సమాచారం. ఈ సినిమాకు సంభందించిన మిగతా వివరాలు
కూడా త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం రజినీకాంత్
రికమెండ్ చేస్తేనే ధనుష్ తో సినిమా చేయడానికి శంకర్ ఒప్పుకున్నాడని కూడా
అనుకుంటున్నారు.
No comments:
Post a Comment